ఎన్నికలకు ముందు అర్హులైన మేము నేడు ఎందుకు అర్హులం కాదు

ఎన్నికలకు ముందు అర్హులైన మేము నేడు ఎందుకు అర్హులం కాదు
జనసేవ న్యూస్

చిట్టివలస బంతాట మైదానంలో నిన్న జరిగిన పట్టాల పంపిణీ కార్యక్రమం చాలామందికి నిరాశే మిగిలిచింది. కారణం మున్సిపల్ ఎన్నికలకు ముందు హామీ పత్రాలు పొందిన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం ఇస్తామని నమ్మబలికి, ఆ రోజున సుమారు పదివేల మందికి కి హామీ పత్రాలు పంచారు. అది నమ్మి మీకు ఓట్లు వేసిన ప్రజలకు మోసం చేసి నేడు మూడు వేల మంది మాత్రమే పట్టాలు పంచారు. ఎన్నికలకు ముందు అర్హులైన మేము నేడు ఎందుకు అర్హులం కాదో కనీసం మాకు తెలియజేయలేదు అని ప్రజలు వాపోతున్నారు. వైసిపి పార్టీకి ఓట్లు వేసి మోసపోయామని కన్నీరుమున్నీరవుతున్నారు
         ఇక పట్టాలు పొందిన లబ్ధిదారులు దగ్గరకు వస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ళస్థలం 1.5 శెంట్ల స్థలం కేటాయిస్తామని చెప్పి ఒక సెంటు స్థలానికి మాత్రమే పత్రాలు అందజేశారు.ఇది ప్రజలను మోసగించడం కాదా
             ఇంతవరకు అర్బన్ ప్రాంతంలో అన్ని వసతుల మధ్య నివసిస్తున్న వారికి కనీస మౌలిక వసతులు లేని ప్రాంతంలో ఇల్లు నిర్మాణం వెంటనే ప్రారంభించాలని నిబంధనలతో కూడిన పత్రాలపై సంతకాలు చేయించుకొని ఇల్లు నిర్మాణం ప్రారంభించక పోయినట్లయితే ఇళ్ళ పట్టాలు రద్దు చేస్తామని బెదిరిస్తున్నారు. నిజానికి ప్రభుత్వం అందించే లక్షా ఎనభై వేల రూపాయలతో ఇంటి నిర్మాణం ఎలా పూర్తవుతుంది.
      గతంలో ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లుగా ఇల్లు కట్టుకో లేకపోయినట్లయితే మేమే కట్టిస్తాం అని చెప్పిన మాటకు, మడమ తిప్పకుండా వారందరికీ మీరే ఇల్లు నిర్మాణం చేసి అందించాలని తెలుగుదేశం పార్టీ తరపున పిట్ట సురేష్ డిమాండ్ చేస్తున్నాం.

భీమిలి రిపోర్టర్ పి శ్రీనివాసరావు
జనసేవ న్యూస్