పాలిటెక్నిక్ లో ప్రవేశము కొరకు పాలీసెట్ ఎంట్రన్స్ పరీక్ష
పాలిటెక్నిక్ లో ప్రవేశము కొరకు పాలీసెట్ ఎంట్రన్స్ పరీక్ష 29.05.2022 న నిర్వహిచబడును . పదవ తరగతి పాసైన లేదా పదవ తరగతి పరీక్షకు ఈ ఏడాది హాజరైన విద్యార్థులు అందరు అర్హులే. ఎంట్రన్స్ పరీక్షకు అప్లై చేసుకొనుటకు ఆఖరు తేదీ 18.05.2022. అప్లై చేసుకొనే విద్యార్థులు భీమునిపట్నం పాలిటెక్నిక్ కళాశాలకు గాని లేదా ఏదైనా ఇంటర్నెట్ సెంటర్ ద్వారా గాని అప్లై చేసుకోవచ్చును.
పరీక్ష మాథెమాటిక్స్, ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ సబ్జక్ట్స్ లో 120 మార్కులకు నిర్వహించబడును. పాలీసెట్ ఎంట్రన్స్ రాసి ప్రవేశము పొందినవారు మాత్రమే స్కాలర్షిప్ మరియు ఫీజు రాయితీకి అర్హులు. ఇతర వివరములకు ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ గారిని లేదా సిబ్బందిని సంప్రదించండి.
డాక్టర్.మురళి కృష్ణ, ప్రిన్సిపాల్, ప్రభుత్వ మహిళ పాలిటెక్నిక్, భీమునిపట్నం.
భీమిలి రిపోర్టర్ పి శ్రీనివాసరావు